IND vs ZIM 1st ODI: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్నఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఆట ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లు జనగణమన ఆలపిస్తూ కనిపించారు. ఈ సమయంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కళ్లు మూసుకుని జాతీయగీతం ఆలపిస్తుండగా ఓ తేనెటీగ అతని చెవిలో దూరే ప్రయత్నం చేసింది. కానీ ఇషాన్ చాకచక్యంగా ఆ తేనెటీగ నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆపై.. ఆనవాయితీగా వస్తోన్న జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో నిల్చున్నారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పక్కన నిల్చొన్న ఇషాన్ కిషన్ కళ్లు మూసుకుని సహచరులతో కలిసి జనగణమన ఆలపిస్తూ కనిపించాడు. కానీ.. సడన్గా ఓ తేనెటీగ వచ్చి అతని చెవిలో దూరబోయింది. దాంతో వెంటనే కళ్లు తెరిచిన ఇషాన్ తేనెటీగ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ.. అది మరోసారి అతని చెవిలో దూరే ప్రయత్నం చేయడంతో కిందకి వంగాడు. దాంతో ఆ తేనెటీగ వెళ్లిపోయింది. అతను శబ్దం చేయకపోవడంతో అందరూ ఎలాంటి అంతరాయంలేకుండా జాతీయ గీతాన్ని ఆలపించగలిగారు.
Ishan Kishan during National Anthem, got annoyed by a Bee.#INDvZIM pic.twitter.com/e1RNct2xj1
— Shubham🇮🇳 (@LoyalCTFan) August 18, 2022
జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 35 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో రిచర్డ్ నగరవ 16, బ్రాడ్ ఇవాన్స్ 15 పరుగులతో ఉన్నారు. కాగా, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లను 2-1తో గెలిచిన భారత జట్టు.. వెస్టిండీస్ గడ్డ మీద శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్(3-0) చేసిన విషయం తెలిసిందే. అలాగే.. విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1 తో కైవసం చేసుకుంది.
A 50-run stand for the 9th wicket as Zimbabwe continue to frustrate India
ZIM – 161 for 8 (37th ov)#ZIMvIND
— Cricbuzz (@cricbuzz) August 18, 2022
ఇదీ చదవండి: వీడియో: రిటైరై మూడేళ్లు దాటినా.. యువీ బ్యాటింగ్లో పవర్ మాత్రం తగ్గలేదు
ఇదీ చదవండి: ‘2023-27’ క్రికెట్ షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 780 మ్యాచ్లు!