భారత టీం ఇండియా క్రికెటర్లకు ఊహించని విపత్తులు రోడ్డు ప్రమాదం రూపంలో ముంచుకొస్తున్నాయి. వీరిని యాక్సిడెంట్లు వీడటం లేదు. గత ఏడాది చివరిలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి విదితమే.
టీమిండియాలో క్రికెటర్లు మ్యాచ్, ప్రాక్టీసు సమయాల్లో గాయ పడటం కామన్. దీని వల్ల పలు మ్యాచ్లకు దూరం అవుతుంటారు. అయితే వీరూ స్టేడియం వెలుపల కూడా ప్రమాదాలు బారిన పడుతున్నారు. భారత టీం ఇండియా క్రికెటర్లకు ఊహించని విపత్తులు రోడ్డు ప్రమాదం రూపంలో ముంచుకొస్తున్నాయి. వీరిని యాక్సిడెంట్లు వీడటం లేదు. గత ఏడాది చివరిలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి విదితమే. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు మాజీ క్రికెటర్ తృటిలో ప్రాణ ప్రాయం నుండి తప్పించుకున్నారు. ఈ వార్త ఇప్పుడు క్రీడా లోకంలో కలవర పాటుకు గురి చేస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పెను ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం మీరట్లో ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ప్రవీణ్తో పాటు ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాండవ్ నగర్ నుండి లాండ్ రోవర్ కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే రెప్పపాటులో భారీ ప్రమాదం నుండి ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమైంది. ట్రక్కు డ్రైవర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా, ప్రవీణ్ రోడ్డు ప్రమాదం బారిన పడటం ఇది రెండవ సారి. 2007లో ఆయనకు జీపులో నుండి కింద పడిపోయారు.ప్రవీణ్ కుమార్ బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం ఆయన మీరట్లో ముల్తాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. భారత్ తరుపున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ 20లు ఆడాడు. 2007-08లో ఆస్ట్రేలియాతో ఆడిన సీబీ సిరీస్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు ఈ పేసర్. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 119 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 5.13 ఎకానమీతో 78 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/31. 2018లో క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించాడు.