ప్రస్తుతం ప్రపంచంపై కరోనా థర్డ్ వేవ్ తన ప్రతాపం చూపుతోంది. ఈ క్రమంలో క్రికెట్పై కూడా తన పంచా విసురుతోంది. ఇప్పటికే కరోనా కేసుల కారణంగా పలు మ్యాచ్లు వాయిదా పడ్డాయి. తాజాగా వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య నేడు జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. ఐర్లాండ్ టీమ్లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనికి తోడు మరో ఇద్దరు గాయపడ్డారు. ఇదివరకు కరోనా బారిన పడ్డ వారితో కలుపుకుని మొత్తం ఐదుగురు ఆటగాళ్లు కరోనా కారణంగా ఐసోలేషన్లో ఉన్నారు. ఈ దశ మ్యాచ్ వాయిదా వేయడం తప్పలేదు.
📡: ODI POSTPONED
The second CG Insurance ODI between Ireland Men and West Indies Men scheduled for tomorrow has been postponed.
➡️ Read statement: https://t.co/pfKCnQZXUv#BackingGreen ☘️🏏 pic.twitter.com/KGbvxouRAW
— Cricket Ireland (@cricketireland) January 10, 2022
జమైకాలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఒక వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. మరో రెండు వన్డేలతో పాటు టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ల నిర్వహణపై వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నాయి. ఐర్లాండ్ ఆటగాళ్లు ఆండ్రూ బల్బిర్నీ, వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ గత వారమే కరోనా బారిన పడ్డారు. తాజాగా పాల్ స్టిర్లింగ్, సిమి సింగ్, బెన్ వైట్కు వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. అంతేకాకుండా ఐర్లాండ్ హెడ్ కోచ్ డేవిడ్ రిప్లీ కూడా కరోనాతో చికిత్స పొందున్నారు. కాగా ఐర్లాండ్ స్పిన్ బౌలర్ ఆండీ మెక్బ్రైన్, ఫాస్ట్ బౌలర్ మార్క్ అడైర్ గాయాల బారిన పడ్డారు. మరి క్రికెటర్లు ఇలా కరోనా బారిన పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.