ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ వరుస పథకాలు సాధిస్తున్నారు. తాజాగా పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో సుధీర్ భారత్కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ ఏడాది పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం అద్భుతం చోటు చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ గొప్ప చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కామన్ వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సాధించిన బంగారు పతకాల సంఖ్య 6కు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 20కి చేరుకుంది. ఇందులో 7 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.
హర్యానాలోని సోనిపట్ లో సుదీర్ ఓ చిన్న రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తీవ్ర జ్వరం కారణంగా పోలియో భారిన పడ్డాడు. చిన్న తనంలో ఎన్నో కష్టాలు పడ్డ సధీర్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో ఉండేవాడు. దానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా మంచి ప్రోత్సాహం అందించారు. 2018లో ఆసియా పారా గేమ్స్ కాంస్య పతక విజేత నిలిచిన ఆయన వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు. తాజాగా ఇప్పుడు మరో అద్భుతమైన రికార్డు స్థాపించాడు. ఈ క్రీడాకారుడిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Union Sports Minister Anurag Thakur congratulates Sudhir for winning a gold medal in Para Powerlifting at #CommonwealthGames pic.twitter.com/8MmILJMkmS
— ANI (@ANI) August 4, 2022