వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు చేస్తున్నట్లు దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రకటన చేసింది. ఆధిపత్య పోరు కోసం నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగుతుండడం, మ్యాచుల నిర్వహణ ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
‘ఆట తక్కువ… వివాదాలు ఎక్కువ’ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఈ క్యాప్షన్ సరిగ్గా సరిపోతుంది. అధ్యక్ష ఎన్నిక మొదలు… నిధుల దుర్వినియోగం… ఒకరిపై ఒకరి ఆరోపణలు.. అంబుడ్స్ మెన్… ఇలా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆపై అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేది అప్పుడప్పుడే అయినా.. అందులోనూ అవకతవకలే. సామాన్యులకు దక్కాల్సిన టిక్కెట్లు కార్పొరేట్ల వశం అవుతున్నాయి. టిక్కెట్లు మీరు అమ్మకున్నారంటే.. లేదు మీరు అమ్ముకున్నారు అంటూ కమిటీ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు. ఈ మొత్తం వివాదానికి దేశ అత్యునత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలు చూసుకుంటున్న కమిటీని దేశ అత్యునత న్యాయస్థానం రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని కొత్త కమిటీ హెచ్సీఏ వ్యవహారాలు చూసుకుంటుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఆధిపత్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిబంధనలు ఉల్లంఘించాడంటూ అధ్యక్షుడు అజారుద్దీన్కు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, అజారుద్దీన్ వారిపై తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడం మనం ఎన్నో సార్లు చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తీర్పు అన్ని వివాదాలకు సరైన పరిష్కారమే అని చెప్పాలి.
Supreme Court tasks retired Justice L Nageswara Rao to oversee Hyderabad Cricket Association polls
report by @AB_Hazardous https://t.co/gev5iOcz7H
— Bar & Bench (@barandbench) February 14, 2023