యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా HCAపై ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దాంతో ఎట్టకేలకు దిగొచ్చిన అసోసియేషన్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు చేస్తున్నట్లు దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రకటన చేసింది. ఆధిపత్య పోరు కోసం నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగుతుండడం, మ్యాచుల నిర్వహణ ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా మజీ కెప్టెన్, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ఇంటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అజహర్ తండ్రి మొహమ్మద్ యూసుఫ్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యూసుఫ్.. బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో అజహర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రేపు బంజార హిల్స్లో మధ్యాహ్నం జోహర్ నమాజ్ తర్వాత ఆయన ఖనన కార్యక్రమాలు చేయనున్నట్లు సమాచారం. కాగా.. అజహరుద్దీన్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అవుటర్ […]
ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు రాజకీయ రంగు పులుముకుంది. ఆఫ్ లైన్ టికెట్ల కోసం జనాలు వేలాది సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్ కు తరలిరావడం, అది కాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే.. ఈ విషయంపై సుప్రీం కోర్టు హై లెవెల్ కమిటీని కూడా నియమించింది. తాజాగా, ఈ విషయంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ […]
ఉప్పల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం నాడు జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణపై, మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, తెలంగాణ ఏసీపీ డీజీ అంజనీ కుమార్, భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజులతో హైలెవల్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఆ వివరాలు.. ఉప్పల్ స్టేడియంలో సుమారు మూడేళ్ల […]
మన ఇండియాలో క్రికెట్కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ వీక్షించడం కోసం ఎంత దూరమైన వెళ్తారు అభిమానులు. ఇక టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో టీ20 టికెట్లు అమ్మకం నిర్వహించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు దక్కించుకోవడానికి వేల సంఖ్యలో పరిమితికి […]
హైదరాబాద్- భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజారుద్దీన్ పై వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ వ్యవహారం చాలా రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఈ నెల 2న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్కౌన్సిల్ అజారుద్దీన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అజారుద్దీన్పై ఉన్న కేసులు పెండింగ్లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్సీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 11న హైదరాబాద్ క్రికెట్ […]