ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరును ప్రస్తుతం కొనసాగిస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరును ప్రస్తుతం కొనసాగిస్తోంది. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తర్వాత ఆసీస్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ వన్డేలో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరగడంతో.. ఆసీస్ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. దాంతో 35.4 ఓవర్లకు 188 పరుగులకు కుప్పకూలింది ఆసీస్ జట్టు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టారు. షమీ, సిరాజ్, జడేజాలు ఆసీస్ ఇన్నింగ్స్ ను కుదేలు చేశారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ముంబై వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ను తన తొలి ఓవర్ లోనే దెబ్బకొట్టాడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ సిరాజ్. ఆసీస్ స్టార్ బ్యాటర్ ఓపెనర్ ట్రవిస్ హెడ్(5) ను బౌల్డ్ చేసి ఇండియాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ స్మిత్, మిచెల్ మార్ష్ కు అండగా నిలబడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలోనే వీరిద్దరు రెండో వికెట్ కు 75 పరుగులు జోడించారు. దాంతో 12.3 ఓవర్లకు 77/1 పటిష్ట స్థితిలో నిలిచినట్లు కనిపించింది ఆసీస్. ఈ క్రమంలోనే గొప్పగా పుంజుకున్న టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలవరించారు. ఇక ప్రమాదకర జోడీగా మారుతున్న మార్ష్-స్మిత్ లను విడగొట్టాడు పాండ్యా. కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో.. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ అవుట్ అయ్యాడు. మరోపక్క ఒంటరి పోరాటం చేస్తూ.. స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు మార్ష్.
అయితే సెంచరీకి దగ్గర అవుతున్న మార్ష్(81) ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 19.4 ఓవర్లకు 129/3. ఇక మార్ష్ వికెట్ పడిన తర్వాత ఏ ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేదు. వెంట వెంటనే వికెట్లు చేజార్చు కుంటూ 35.4 ఓవర్లకు 188 పరుగులకు కుప్పకూలింది ఆసీస్ జట్టు. మిగతా బ్యాటర్లలో లబూషేన్(22), జోస్ ఇంగ్లిష్(26), కామెరూన్ గ్రీన్(12)మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ, సిరాజ్ తలా 3 వికెట్లు తీయగా.. జడేజా రెండు వికెట్లు, పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీసి ఆసీస్ ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. అయితే 20 ఓవర్లకు 129/3 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్.. తన చివరి 7 వికెట్లను కేవలం 50 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. వరల్డ్ ఫేవరెట్ జట్టుగా పేరోందిన ఆసీస్ ఇలా చివరి 7 వికెట్లను 50 రన్స్ కే కోల్పోవడంతో.. గతంలో ఇలా పసికూనలైన జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి జట్లే ఇలా కుప్పకూలేవని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. మరి ఆస్ట్రేలియా జింబాబ్వే, బంగ్లాల కంటే ఘోరంగా కుప్పకూలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Australia have collapsed like a pack of cards. India bundled out Australia for just 188 runs.#Cricket #AUSvsIND #ODI #CricTracker pic.twitter.com/HcMp3KnAxF
— CricTracker (@Cricketracker) March 17, 2023