ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడింది. గ్రూప్ స్టేజ్లో పాక్ను చిత్తు చేసిన భారత్.. మళ్లీ అదే ఫీట్ను కొనసాగించలేకపోయింది. ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమికి చాలా కారణాలు ఉన్నా.. రిషభ్ పంత్పై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. అందుకు అతను అవుటైన విధానమే ప్రధాన కారణం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. పవర్ప్లేలో ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కానీ.. వేగంగా ఆడే క్రమంలో ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ.. టీమిండియా ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నా.. మిడిల్డార్ బ్యాటర్లు అతనికి సహకరిచలేదు.
ముఖ్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ అయితే.. దారుణంగా చెత్త షాట్ ఆడి మరీ తన వికెట్ను పారేసుకున్నాడు. ఒక పక్క కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేస్తుంటే అతనికి స్రైక్ ఇచ్చినా సరిపోయే టైమ్లో అనవసరపు రివర్స్ స్వీప్ ఆడి పాక్ చేతిలో తన వికెట్ పెట్టాడు. నిజానికి రిషభ్ పంత్ను ఒక స్ట్రాటజీ ప్రకారం జట్టులోకి తీసుకున్నారు. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో పంత్ ప్లేస్లో దినేష్ కార్తీక్కు అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్ ఈ సారి డీకేను కాదని పంత్కు చోటు ఇచ్చింది. ఫినిషర్గా అద్భుతమైన ఫామ్లో ఉన్న డీకేను సైతం కాదని పంత్కు అవకాశం ఇవ్వడంపై విమర్శలు వచ్చినా.. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లేకపోవడంతో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కోటాను భర్తీ చేయడంతో పాటు ఫినిషర్గా పనికొస్తాడని భావించి పంత్ను ఆడించారు.
తన ఎంపిక వెనుక ఇంత ప్రాధాన్యత ఉన్న విషయాన్ని పట్టించుకోని పంత్ నిర్లక్ష్యపు షాట్తో దారుణంగా నిరాశ పర్చాడు. అలాగే దినేష్ కార్తీక్ లేని లోటు కూడా స్పష్టం కనిపించింది. డెత్ ఓవర్స్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలిగే డీకే.. లేకపోవడంతో భారత్కు అవసరమైన ఫినిషింగ్ టచ్ రాలేదు. కోహ్లీ చివరి వరకూ క్రీజ్లో ఉన్నా.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం, సింగిల్స్, డబుల్స్ ఎక్కువగా పరిగెత్తడంతో అతను కూడా అలిసిపోయాడు. పైగా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్కు క్యూకట్టడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. అప్పటికీ 181 పరుగుల టార్గెట్ వచ్చిందంటూ అది కోహ్లీ వల్లే. కీలకమైన సమయంలో పంత్ ఆ చెత్త షాట్ ఆడి అవుట్ కాకుండా.. టీమ్లో తన రోల్ గుర్తించి ఆడిఉంటే.. టీమిండియాకు మరింత మంచి స్కోర్ వచ్చేది.
కానీ.. 12 బంతుల్లో రెండు ఫోర్లతో 14 పరుగులు చేసి పంత్ షాదాబ్ వేసిన 14వ ఓవర్చివరి బంతికి ఆసిఫ్ అలీకి సులువైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ నిర్లక్ష్యపు ఆట టీమిండియా ఓటమిపై ప్రభావం చూపించిన మాట వాస్తవం. ఇదే విషయంపై అవుటై డ్రెస్సింగ్రూమ్కు వెళ్లిన పంత్పై కెప్టెన్ రోహిత్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. రిషభ్ పంత్ అవుటైన విధానంపై సోషల్ మీడియాలో సైతం సెటైర్ల వర్షం కురుస్తోంది. ‘లెఫ్ట్ హ్యాండర్ కావాలని జట్టులోకి తీసుకుంటే.. రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పంత్ కొంపముంచాడంటూ’ నెటిజన్లు పంత్ను ఆడేసుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్! క్యాచ్ వదిలేసి టీమిండియా కొంపముంచిన అర్షదీప్
Captain Rohit Sharma wasn’t happy with Rishabh Pant and Hardik Pandya’s dismissals.
📸: Disney+Hotstar pic.twitter.com/k4QRm3RMpH
— CricTracker (@Cricketracker) September 4, 2022
All The Best @RishabhPant17 🥺🥺#RohitSharma #RishabPant #INDvsPAK pic.twitter.com/LwDu5sqInF
— 𝓒𝓱𝓲𝓴𝓾 (@Chiku2324) September 4, 2022