వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కన్ను మూశారు.
వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది. వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అకాల మరణం చెందారు. ఏపీ క్షత్రియ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్, ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరోజు రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన పాతపాటి సర్రాజు.. అక్కడ చాలా సేపు పార్టీ నాయకులతో గడిపారు. రాత్రి 10 గంటల వరకూ పార్టీ నాయకులతో గడిపిన ఆయన తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సర్రాజు మృతి పట్ల సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.
పాతపాటి సర్రాజు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భర్తిగా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాతపాటి సర్రాజు మృతి పట్ల వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు ఆయన మృతికి చింతిస్తూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీరు కూడా కోరుకోండి.
గౌరవనీయులు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,ఉండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు,క్షత్రియ కార్పొరేషన్ & డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పాతపాటి సర్రాజు గారు అకాల మరణం వారి మరణానికి చింతిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూవారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. 🙏 pic.twitter.com/5ef46afo75
— Kammila Kannapa Raju (@KKRaju_ysrcp) February 18, 2023