మాజీ మంత్రి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో పాల్గొన్నన ఆయన ప్రభుత్వ పాలను దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్లకా మీరు అధికారం కట్టబెట్టారంటూ ఇటు ఓటర్లను కూడా ప్రశ్నించారు. కోడెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాటలు మొదలు పెట్టిన అయ్యన్న ప్రభుత్వ పాలన, పథకాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన, తీసుకురాబోతున్న పథకాలు, కార్యక్రమాలపై సెటైర్లు వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడితే ఏం చేస్తారు? కేసు పెడతారు.. జైల్లో వేస్తారు అంతేకదా? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మొదలు మొత్తం క్యాబినెట్ మొత్తాన్ని విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు.
‘అసలు ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా ఈ చెత్త నా కొ..కి, అసలు పాలనంటే ఏంటో తెలుసా ఈ గాడి..కి, ముఖ్యమంత్రి బ్రాందీ అమ్ముకుంటారా? ముఖ్యమంత్రి చికెన్ అమ్ముకుంటారా? ముఖ్యమంత్రి చేపలు అమ్ముకుంటారా? అంటూ అయ్యన్న ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాటుసారా, బ్లాక్ టికెట్లు కూడా అమ్ముకుంటారంటా! అంటూ అభ్యంతరకర విమర్శలతో ప్రభుత్వంపై దాడి చేశారు. ‘నేను ఓ సలహా ఇస్తా.. బ్రాందీషాపుల ముందు చీకులు కూడా అమ్ముకోండి’ అంటూ అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ క్యాబినెట్పై అయ్యన్న రెచ్చిపోయి విమర్శలు చేశారు. టీఎంసీ అంటే తెలియని వ్యక్తిని తెచ్చి ఇరిగేషన్ మంత్రిగా చేశారు. గుడిపై బయట కొబ్బరికాయలు అమ్ముకునే అతడిని దేవదాయ శాఖ మంత్రిని చేశారు. హోమంత్రి సుచరిత పేరు కూడా తెలియదు అన్నట్లు ప్రవర్తించిన మంత్రి ఆడవాళ్లపై జగుతున్న దాడులకు నైతిక బాధ్యత కింద రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరో పథకం చెప్తానంటూ.. ఇంటింటికి తిరిగ మల్లెపూలు అమ్ముకోండి. అందుకు అంబటి రాంబును అధ్యక్షుడిని చేయాలంటూ సూచించారు. ‘అంబటి రాంబాబుకు గంట కావాలంట.. అవంతికైతే అరగంట చాలంటా’ అంటూ అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.
ఏపీలో ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు విమర్శలపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు క్షపాణలు చెప్పాలంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.