నిత్యం జీవితంలో రాజకీయలతో ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు బిజీ బీజీగా గడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి.. వ్యవసాయంలో నిమగ్నమవుతుంటారు. అలా వ్యవసాయం చేస్తూ ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు వార్తలో నిలిచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వరి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరిచేందుకు అధికారులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తుంటారు. అంతేకాక తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం భిన్నంగా ఉంటారు. వారు ప్రజలకు సేవ చేస్తూనే.. వ్యవసాయం, ఇతర పనులు కూడా చేస్తుంటారు. పొలం వేసి పంటలు సైతం పండిస్తుంటారు. తాము వ్యవసాయం చేస్తూ సేద తీరుతామంటున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. అలాంటి వారిలో ఒకరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వరిపొలంలో ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీకి చెందిన ఈ ఎమ్మెల్యే.. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడుతుంటారు. అలానే అధికార వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. టీడీపీ అధినాయకత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇలా రాజకీయ జీవితంలో తీరికలేకుండా గడిపే ఆయన సొంత పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తూ సేద తీరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెంలోని తన పొలానికి ఎమ్మెల్యే నిమ్మల వెళ్లారు. వరి పంటలో ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్వయంగా గట్ల పై నడుస్తూ దుబ్బులను పరిశీలించారు. గత మూడు నెలల నుంచి వరి పంటకు ఎరువులు వేస్తూ, తరచూ నీళ్లు పెడుతూ కంటిక రెప్పలా కాపాడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మరో 40 రోజుల వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. వరిపొలంలో ఆయన కలియ తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఇలా ప్రజాప్రతినిధు రైతుల మారి పొలం బాట పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.