ప్రతిపక్ష నేత నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఓ చోట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
రాజకీయ నాయకులు అనగానే విమర్శలు, ఆరోపణలు ఇవే గుర్తుకు వస్తాయి. తప్పు చేసినప్పుడు విమర్శించాలి.. మంచి చేస్తే పొగడాలి.. అధికారం, విపక్షం అనే తేడా లేకుండా.. మంచి పనులు ఎవరు చేసినా ప్రశంసించగలిగే వ్యక్తే నిజమైన నేత. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇది నిజమే అనిపిస్తోంది. లోకేష్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రసుత్తం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బుధవారం 68వ రోజు జరిగింది.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. దాన్ని ఎవరూ దాటకూడదు. ఈ విషయాన్ని మన మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులు దీన్ని ఆచరించి చూపారు. వైఎస్సార్, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ, ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదు. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో గౌరవంగా మెలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ రాష్ట్ర పరువు తీసిని దాఖలాలు లేవు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను వైఎస్సార్ కొనసాగించారు గాని చెడగొట్టలేదు’’ అని చెప్పుకొచ్చారు.
కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు పోయిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమని నారా లోకేష్ వెల్లడించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యవస్థ మాత్రమే శాశ్వతం అన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని లోకేష్ హితవు పలికారు. లోకేష్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.