ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటి ఆడవారి జోలికి వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో జూనియర్ తీరుపై టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. జూనియర్ తీరు సరికాదన్నారు. ఈ వివాదంపై టీడీపీ నేత బోండా ఉమా కూడా ఇదే విధంగా స్పందించారు. ఈ వ్యవహారంలో జూనియర్ తీరు సరిగా లేదని తెలిపారు.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ తో భేటీకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
సుమన్ టీవీ అధ్వర్యంలో సీనియన్ జర్నలిస్ట్ జాఫర్, బోండా ఉమాని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ‘‘భువనేశ్వరిపై వైసీపీ నేతల అసభ్య వ్యాఖ్యల అంశంలో జూనియర్ తీరు సరైంది కాదని బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా’’ అని జాఫర్ ప్రశ్నించారు. అందుకు బోండా ఉమ.. ‘‘అవునని’’ సమాధానం చెప్పారు. అందుకు జాఫర్ ‘‘అంటే.. వివాదం గురించి తెలిసిన వెంటనే జూనియర్ కత్తి పట్టుకుని.. కొడాలి నాని, వల్లభనేని వంశీలపైకి వెళ్లాలా’’ అని ప్రశ్నించగా.. అందుకు బోండా ఉమా.. ‘‘అవును అదే విధంగా స్పందించాలి. కత్తి తీసుకుని వెళ్తాడా.. కర్ర తీసుకుని వెళ్తాడా అనేది జూనియర్ ఇష్టం కానీ వెళ్లాలి. అంతేతప్ప తమలపాకుతో కొట్టినట్లు స్పందించడం సరి కాదు. ఆడవారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. తన కుటుంబ సభ్యురాలిని అవమానిస్తే.. జూనియర్.. కనీసం వారి తోలు తీస్తానని కూడా వార్నింగ్ ఇవ్వకపోవడం సరికాదు. జూనియర్ స్పందించాల్సిన రీతిలో స్పందిచలేదు’’ అని బోండా ఉమా తెలిపారు. బోండా ఉమా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్కు కారణమేంటంటే..