మాజీ మంత్రి, కన్నా లక్ష్మీనారాయణ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనుమతి లేకపోవడంతోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
మాజీ మంత్రి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు, అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరంలో చంద్రబాబు, కన్నాలతో కూడిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను గుంటూరు మున్సిపల్ శాఖ సిబ్బంది తొలగించారు. దీంతో ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ శ్రేణులు, కన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకలుపై కక్షపూరితంగా వ్యవహరిస్తుదంటు ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల మేరకే ఫ్లెక్సీలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరుతున్న సందర్భంగా గుంటూరులో ఆయన అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు వాటిని తొలిగించారు. అధికారుల తీరుపై కన్నా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. అయితే ఫ్లెక్సీలను తొలగించే సయమంలో సిబ్బందిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో చేరనున్నారు.
కన్నా పసుపు కండువా కప్పుకోనున్నారు. దాదాపు మూడు వేల మంది అనుయాయులతో ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో కన్నా ఇంటి వద్ద నుంచి ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్, చంద్రబాబు, కన్నా ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. పలు చోట్లో ఈ ఫ్లైక్సీలను అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.