చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ కార్యకర్తలు నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో తొక్కిసిలాట కారణంగా సుమారు 11 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో తొక్కిసిలాట కారణంగా 8 మంది మృతి చెందగా.. గుంటూరు జిల్లా ఉయ్యూరులో చంద్రన్న సంక్రాతి కానుక పేరుతో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే.. అమాయకులు మృతి చెందారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన సభకు ఎక్కువ మంది వచ్చారని చూపించుకోవడం కోసం చంద్రబాబు.. ఇరుకు ప్రదేశాల్లో సభలు నిర్వహించి.. అమాయకులైన 11మంది అమాయకులను బలి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
కందుకూరు, గుంటూరు ఘటనల్ని ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించాడు ఆర్జీవీ. కందుకూరు సంగతి పక్కన పెడితే గుంటూరు ఘటనపై తనకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అన్నాడు ఆర్జీవీ. పెద్ద గ్రౌండ్లో సమావేశాలు నిర్వహిస్తే.. జనాలు ఎక్కువగా కనిపించరు. దాంతో తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికి తెలిసిపోతుందనే భయంతో చంద్రబాబు ఇలా చేశాడని.. ఫలితంగా ముగ్గురు మహిళలు బలయ్యారని ఆర్జీవీ మండిపడ్డాడు. చిన్న ప్రాంతాల్లో సమావేశాలు పెడితే తక్కువ మంది వచ్చినా.. చాలా మంది వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు చంద్రన్న కానుకల పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు వేసి ప్రజలను ఈ కార్యక్రమానికి పిలిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు.. కుక్కలకు, మేకలకు దాణా పడేసినట్లు ప్యాకెట్లు విసిరేశారు. జనాలను ఫోటో షూట్ కోసం పిలిచి.. అది అవ్వగానే చంద్రబాబు వెళ్లిపోయాడు. ఇన్ని సార్లు సీఎం అయిన వ్యక్తికి.. ఇలాంటి విషయాల గురించి తెలియదా. చంద్రబాబు.. ప్రజల ప్రాణాలను గడ్డి పోచతో సమానంగా భావించారు. వ్యక్తిగత ఇగోనే చంద్రబాబుకు ముఖ్యం.. ఎంతమంది పోతే అంత పాపులారిటీ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేశారు. 40 అనుభవం ఉంది కదా.. ఇరుకు ప్రదేశాల్లో సమావేశాల వల్ల ఏం జరుగుతుందో తెలియదా. చంద్రబాబుకు మనుషుల ప్రాణాల కంటే పాపులారిటీ, ఫేమ్ ముఖ్యం. రాజకీయాల్లో ప్రజల భద్రత ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతే ఎలా. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. వాళ్లను చంపి.. వారిపై నిలబడి పాపులారిటీ పెంచుకోవడం దారుణం. హిట్లర్ ముస్సోలిని తర్వాత ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమే’’ అంటూ ఆర్జీవీ ఓ రేంజ్లో ఫైరయ్యాడు. మరి చంద్రబాబు ప్రచార యావ వల్లే ఇలా జరిగిందంటున్న ఆర్జీవీ వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెఓంట్స్ రూపంలో తెలిజేయండి.