భారతదేశాన్ని కొన్ని దశబ్దాల పాటు ఏలి ఘనమైన చరిత్రను మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దేశ స్వతంత్ర ఉద్యమ సమయంలో ముందుండి స్వతంత్ర ఏర్పాటుకై అన్ని రకాలుగా సహయ సహకాలు అందించి చివరికి స్వతంత్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది. అయితే బ్రిటిషు సంకెళ్ల నుంచి బయటపడి స్వతంత్ర సిద్దించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి ఎన్నో దశబ్దాలుగా దేశాన్ని పాలించి దేశ ప్రజలకు సుపరిపాలను అందించింది. గాంధీ నుంచి మొదలుకుని నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి శక్తివంతమైన నాయకులు ముందుండి దేశాన్ని పరిపాలించారు. అయితే గతమెంతో ఘనమన్నట్లుగా సాగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం.. ఇప్పుడు దయనీయ స్థితిలోకి వెళ్లిపోయింది.
దీంతో నేటి తరం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదేం పరిస్థితి అంటూ తమలో కుమిలిపోతున్నారు. అయితే గతంలో ఆసేతు హిమాచాలాన్ని ఏలి ఎంతో ఘనమైన చరిత్రను మూటగట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ స్థితిలోకి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. గత 8 ఏళ్ల క్రితం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉందన్నది మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఏంటి? సరైన నాయకుడు లేకపోవడమే ప్రధాన కారణమా అన్న సంకేతాలు కూడా లేకపోలేదు. ఇకపోతే కష్టాల్లో ఉన్నకాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వీరుడిలా అడుగుపెట్టాడు రాహుల్ గాంధీ. ఒంటి చేత్తో రాజకీయాలను శాషించాలన్న ఆశతో రాజకీయ చదరంగంలోకి వచ్చినా.. కొన్నాళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో తను ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వలేకపోయాడు.
అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా జరిగిన అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘొరంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇక ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి స్థితికి రావడానికి కారకులు ఎవరన్న ప్రశ్నలు వెలువడ్డాయి. ఈ ఘోర పరాభవాన్ని సహించకలేక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ధీటైన నాయకుడు లేకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి అపజయాలు వస్తున్నాయని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికలు, దేశంలో అక్కడక్కడ జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటమిలో ఎదురవ్వడంతో నేతలు తమ దారి తాము చూసుకుంటూ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఇక వీటన్నిటినీ గమనించిన రాహుల్ గాంధీ ఓ గట్టి నిర్ణయానికి వచ్చాడు. గతంలో ఆసేతు హిమాచాలాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పుర్వవైభవం తీసుకురావడానికి రాహల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టాడు. ఈ యాత్రను సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభించారు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు సుమారుగా 3,570 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగనుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసానుంది. ఇక ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వెంట నడిచేందుకు యువత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను వింటున్నారు.
దీంతో రాహుల్ గాంధీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ బతికే ఉందన్న సంకేతాలు ఇస్తూనే.., పార్టీని బలంగా తయారుచేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కప్పుడు రాహుల్ ప్రవర్తన, పని తీరుపై అప్పట్లో మీమ్స్ లోనే కాకుండా అధికార సోషల్ మీడియాలో సైతం రాహుల్ గాంధీని చిన్న చూపు చూస్తూ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇక వీటన్నిటికీ సమాధానం తొందరలోనే చెబుతానన్న బలమైన నమ్మకంతో రాహుల్ గాంధీ ద్రుడమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. యాత్రలో భాగంగా వర్షంలో తడుస్తూ, ఎండలో నడుస్తూ, చలికి వణుకుతూ యాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నాడు.
ఈ యాత్ర చేపట్టింది అసలు రాహుల్ గాంధీనే అని అందరూ అనుకునే రీతిలో పాదయాత్ర చేస్తున్నాడు. మొత్తం తన లుక్ ను మార్చేసి సీరియస్ గా రాజకీయాల్లో పాల్గొంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. అయితే భారత్ జోడో యాత్రకు స్పందన ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. అయితే ఈ యాత్ర ప్రస్తుతం ఆంధ్రాలో అడుగు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు రాహుల్ గాంధీ వెంట నడుస్తూ ముందుకు కదులుతున్నారు. ఇక చివరగా రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకుని చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర ద్వారా రోబోయే రోజుల్లో పార్టీ పుర్వవైభవాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందా? కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గేతో రాబోయే రోజుల్లో పార్టీకి మంచి ఫలితాలు రానున్నాయా? ముందు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.