Kanna Laxminarayana: ఆంధ్రప్రదేశ్ బీజీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో సోము వీర్రాజు తీరును ఆయన తప్పుబట్టారు. పార్టీలో సమన్వయం లోపించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అసలు పార్టీలో ఏం జరుగుతోంది. నాకు ఏమీ తెలియడం లేదు. సమస్యంతా సోము వీర్రాజుతోనే ఉంది. సోము ఒక్కడే అన్నీ చూసుకోవటం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్తో సోము సమన్వయం చేసుకోలేకపోయారు. పవన్తో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. ఏపీలో పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలి. ప్రజస్వామ్య పరిరక్షణ కొరకు ప్రతి పక్షాలు ఏకం కావాలి. రాష్ట్రంలో పొత్తులు ఉంటాయో.. లేవో నాకు తెలియదు. పవన్ కల్యాణ్తో కలిసి నడవడంలో ఢిల్లీ నాయకత్వం చొరవ తీసుకుంటుందని భావిస్తున్నాను. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నెలా పార్టీ నేతలతో కూర్చుని మాట్లాడేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’’ అని అన్నారు.
కాగా, మంగళవారం జనసేనాని పవన్ కల్యాణ్ వైఎస్సార్ సీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తనపై ఆరోపణలు చేసిన వారికి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీటింగ్ అనంతరం ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పవన్ను కలిశారు. విశాఖ ఘటనపై తన సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు ఓ గంటపాటు ఇద్దరూ భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించుకున్నారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి, మీడియాతో ముచ్చటించారు.
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: పవన్ ఆవేశం వెనుక మాస్టర్ ప్లాన్! ఒక్క దెబ్బకి సీఎం చైర్!