2023 లో మే నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తన వాగ్దానాలను స్పష్టంగా ప్రచారం చేసింది. ప్రజలకు హామీ కార్డులు అందజేసి ఎన్నికల రంగంలో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా, టీవీ, రేడియోలలో కాంగ్రెస్ చేసిన సృజనాత్మక ప్రకటనలు కూడా బిజెపి ప్రభావాన్ని తగ్గించాయి.
2023 లో మే నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తన వాగ్దానాలను స్పష్టంగా ప్రచారం చేసింది. ప్రజలకు హామీ కార్డులు అందజేసి ఎన్నికల రంగంలో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా, టీవీ, రేడియోలలో కాంగ్రెస్ చేసిన సృజనాత్మక ప్రకటనలు కూడా బిజెపి ప్రభావాన్ని తగ్గించాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు 3000 రూపాయల భృతి, ప్రతి గృహిణికి 2000 రూపాయల భృతి సహా అనేక సంచలన ప్రకటనలు చేసింది. దీంతో పాటు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అలా ప్రకటించిన కొద్దిరోజులకే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి రావడం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఓ కారణం అయ్యిందని చెప్పవచ్చు.
గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించడం వలన పెద్ద సంఖ్యలో కేఎస్ఆర్టీసీ బస్సులో మహిళలు పుణ్యక్షేత్రాలకు మరింత ఎక్కువగా తరళివెళ్తున్నారు. ముఖ్యంగా అయితే ధర్మస్థల, కుక్కె సుబ్రమణ్యం, మురుడేథ్వర్, హంపి వంటి పుణ్యక్షేత్రాలకు మహిళలు బారీ సంఖ్యలో వెళ్తున్నారు. దీంతో అక్కడ ఉన్న బస్సులన్నీ పుల్లుగా దర్శనమిస్తున్నాయని..అర్థం అవుతుంది. అలా కేరళ రాష్ట్రంలోని పలు మార్గాల్లో బస్సులన్నీ ఫుల్ గా కిక్కిరిసిపోతున్నాయి. బస్సులో ఇంతా అడుగు పెట్టేంతా లేకుండా బస్సులు కిటకిటలాడుతున్నాయి. విజయపురా బస్ లో టికెట్లు తీసుకునేందుకు ఓ కండక్టర్ పడుతున్న పాట్లను చూసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బస్సు పూర్తిగా నిండడం వలన కాలు పెట్టే స్థలం కూడా లేకుండా పోయింది. దీంతో కండక్టర్ బస్సులో ఉన్న సీట్లపైకి ఎక్కి టికెట్లు తీసుకుంటున్న వీడియో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకర్షింపజేస్తుంది. అయితే కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని.. కేవలం ఆర్డినరీ బస్సులే కాకుండా.. ఎక్స్ ప్రెస్ బస్సులోను కూడా ఫ్రీ సౌకర్యం కల్గి వుంది. ఆ క్రమంలోనే ఐరావత, రాజహంస లాంటి ఏసీ, లగ్జరీ బస్సులు ఉండేవి. దీంట్లో ఇలాంటి ఫ్రీ సౌకర్యం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు బస్సుల్లో సగం సీట్లను పురుషులకు రిజర్వ్ చేసింది. అలాగే ఆర్టీసీ ఆదాయం దెబ్బతినకుంగా ఇలాంటి చర్యలు తీసుకుంటుంది.