కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించడంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు నిరసనకారులపై కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇదిలా ఉంటే ఈ హింసాత్మక ఘటనలకు ప్రతిపక్షాలే కారణం అనే విధంగా బీజేపీ నేతలు పరోక్షంగా వాపోతున్నారు. అయితే ఈ ఘటనపై రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవి.
ఇది కూడా చదవండి: Kishan Reddy: అగ్నిపథ్ ఆందోళన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!
అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనలు ఆవేదన కలిగించాయి. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకొనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు. సికింద్రాబాద్ హింసాత్మక ఘటనపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5cl09qWOGu
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2022