వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడి జరిగి 24 గంటలు గడవకముందే.. మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డిని సుబ్బారెడ్డి కలవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇక సుబ్బారావుపై దాడి జరగడానికి కారణం ఏంటంటే..
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుబ్బారావు సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని అనుచరుడు సుభాని సుబ్బారావుపై దాడి చేశారు. తనకు ఆరోగ్యం బాగాలేదని.. వదిలి పెట్టాలని సుబ్బారావు వేడుకున్నప్పటికి ఫలితం లేకపోయింది. దాడి అనంతరం సుబ్బారావు ఒంగోలు పోలీస్స్టేషన్కి వెళ్లి.. తనపై జరిగిన దాడి గురించి వివరించారు. అనంతరం కొందరు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి.. విజయవాడ వెళ్లారు.
అక్కడ మంత్రి బాలినేని కలిసి.. జరిగిన సంఘటన గురించి వివరించారు సుబ్బారారు. తానెప్పుడు పార్టీకి, బాలినేనికి విధేయుడినేనని.. నాడు జరిగిన కార్యక్రమంలో కూడా తాను పార్టీలో జరుగుతున్న పరిణామాలసై మాత్రమే మాట్లాడానని తెలిపారు. అనంతరం సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంత్రి బాలినేని, సుబ్బారావు గుప్తా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం చర్చించుకుని.. వివాదానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది.
Sir @balineni_vasu , Your main associate Mr Subhani has attacked , life threatened Mr Subbarao Gupta in Ongole
Any arrests are made so far if law is applicable to you ? pic.twitter.com/qyx8w55nGH
— Telugu360 (@Telugu360) December 20, 2021