టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై, తెలంగాణ మంత్రులపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అసమర్ధ పాలనలో దళిత, ఆదివాసీలు ఎంతో మోసపోయారని, రానున్న కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని తెలిపారు.
ఇక వ్యాఖ్యాలపై స్పందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీపీసీసీ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పూటకో పార్టీ..పూటకో మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డిని నమ్మవచ్చా అంటూ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను తనను నమ్మాలని అంటున్నాడు కానీ..ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలో కాస్త వివరించి చెప్పాలని అన్నాడు. టీడీపీలో ఉన్నా రేవంత్ రెడ్డినా, లేక టీఆర్ఎస్ రేవంత్ రెడ్డినా అని చురకలు అంటించాడు.
దళిత, ఆదివాసీలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడని తెలిపారు. ఇక చంద్రబాబు బిక్షతోనే టీపీసీసీ దక్కించుకున్న రేవంత్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా నమ్ముతారో తెలపాలని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలే సరైన బుద్ది చెబుతారని అన్నారు.