ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి తమిళ హీరో విశాల్ ను వైసీపీ బరిలోకి దింపుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఎలాగైన ఈ స్థానంలో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ రచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కుప్పంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడం కారణంగానే విశాల్ ను పోటీలోకి దింపుతున్నారనే వాధన కూడా బలంగా వినిపించింది.
ఇదిలా ఉంటే ఈ స్థానం నుంచి హీరో విశాల్ పోటీ చేస్తున్నారనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం మాత్రం లేదు.ఇక చంద్రమౌళి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానం నుంచి హీరో విశాల్ ను దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో ఈ సారి బలమైన వైసీపీ అభ్యర్ధిని దింపుతున్నామని తెలిపారు. ఈ స్థానం నుంచి గత రెండు దఫాలుగా రిటైర్డ్ IASఅధికారి చంద్రమౌళి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన YCP ఎమ్మెల్యే మద్దిశెట్టి!
దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రమౌళి తనయుడు భరత్ పోటీ చేయనున్నారని మంత్రి పెద్ది రెడ్డి స్పష్టం చేశారు. చంద్రమౌళి తనయుడు భరత్ ను వైసీపీ కుప్పం అసెంబ్లీకి ఇంచార్జీగా కూడా ప్రకటించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలతో హీరో విశాల్ పోటీ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. కుప్పం అభ్యర్ధిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.