ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమమే అజెండాగా ముందుకేళ్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సంక్షేమ పథకాన్ని తానే స్వయంగా బటన్ నొక్కి మరి ప్రారంభిస్తున్నారు. ప్రతి పథకంలో సీఎం జగన్ తన దైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్-ఆయన పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలు.. అంటే అంతా ఒకే కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. సీఎం జగన్ కూడా అలానే భావిస్తున్నారు. ఈ ఇలాంటి సమయంలో కొత్త వాదన తెరమీదికి వచ్చింది. “ముఖ్య మంత్రికే పేరు వస్తోంది.. మాకు మాత్రం రావడం లేదు” అని సాక్షాత్తూ.. వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించడం.. సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు జిల్లా స్థాయిలో ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా మంత్రులు హాజరయ్యారు. ఈక్రమంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రసంగించారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ..”సీఎం జగన్.. నవరత్న పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో ఎవరికి పేరు వస్తోంది. ఆయనకు మాత్రమే పేరు వస్తోంది. ప్రజల్లో ఆయన పేరుమాత్రమే వినిపిస్తోంది. మమ్మల్ని(ఎమ్మెల్యే) ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు కూడా పేరు రావాలి కదా! మేం కూడా కష్టపడుతున్నాం కదా! కానీ.. మమ్మల్ని ప్రజలు పూచిక పుల్లల్లా తీసిపారేస్తున్నారు. కూరలో కరివేపాకు నాయకులు మాదిరిగా తయారయ్యాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లైనా వెయ్యాలని ఆయన సూచించారు.
వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే వేణుగోపాల్ కోరారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లులను మంజూరు చేయించాలని దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం వైసీపీ అధినేతపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిలయజేయండి.
ఇదీ చదవండి: Kodali Nani: వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని కీలక …