సినిమా షూటింగ్స్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కత్తిమీద సామే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడో స్టార్ హీరో సెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అంటే తెలియని వారుండరు. తమిళంలో అంత కాకపోయినా తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ నుంచి సినిమా వస్తోందంటే చాలు.. మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ, మంచి మెసెజ్ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ‘పందెం కోడి’, ‘భయ్యా’, ‘పొగరు’, ‘ఇంద్రుడు’, ‘అభిమన్యుడు’, ‘డిటెక్టివ్’ లాంటి సినిమాలతో తెలుగు నాట మార్కెట్ను ఏర్పర్చుకున్నాడు. అలాంటి విశాల్ తాజాగా ‘లాఠీ’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఆ మూవీకి పెద్దగా అలరించలేకపోయింది. విశాల్ ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రా అండ్ రస్టిక్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
‘మార్క్ ఆంటోనీ’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా, ఈ మూవీ షూటింగ్లో అనుకోని ప్రమాదం జరిగింది. గోడను ఢీ కొట్టుకుని ఒక జీపు లోపలికి రావాల్సింది.. అయితే ఢీ కొట్టిన తర్వాత వాహనం అదుపుతప్పడంతో ఎదురుగా ఉన్న ఆర్టిస్టుల మీదకు దూసుకొచ్చింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఆర్టిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో నటులకు గాయాలు కాలేదు. మిగతావారికీ ఏమీ కాకపోవడంతో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సెట్లోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది. కాగా, ‘మార్క్ ఆంటోనీ’లో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.
Shocking footage from #MarkAntony shooting spot 😳😱
Due to a techincal issue, a huge accident was supposed to happen. Luckily, no one was injured during this mishap!
Something huge is coming our way ✌️
pic.twitter.com/2Pg6mqj6dm— Harish N S (@Harish_NS149) February 22, 2023