ఏ పార్టీకైనా కార్యాకర్తలే మూలం. పార్టీని ఆదరించాలన్నా, పార్టీ అధినాయకుడుని ఆదరించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించాడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గొప్పమనుసు చాటుకున్నారు. కార్యాకర్తలను వాడుకొని అధికారంలోకి వచ్చాక, వారిని మరిచిపోయే నాయకున్న ఈ రోజుల్లో, కార్యాకర్తల కుటుంబాలకు అండగా నిలవలడం కోసం మహాయజ్ఞానికి సంకల్పించారు. క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం తనవంతుగా కోటి రుపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత ఈ చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నంలకు అందజేశారు.
కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం ప్రతి ఏడాది జనసేన అధినేత ఈ విరాళాన్ని అందజేస్తారు. ఇప్పటికే గత రెండుసార్లు ఈ విరాళం అందించగా, ఇది మూడవసారి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..”క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను..” అని చెప్పుకొచ్చారు.
క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం రూ.కోటి విరాళం అందజేసిన శ్రీ @PawanKalyan గారు#JSPMembershipPhase3
Link: https://t.co/DfbNZaUPB6 pic.twitter.com/saOZQHG1Ew
— JanaSena Party (@JanaSenaParty) February 22, 2023
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి తనవంతుగా 1 కోటి రూపాయల విరాళాన్ని పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి, కోశాధికారి శ్రీ ఎ.వి రత్నం గారికి అందజేసిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.#JSPMembershipPhase3 pic.twitter.com/Q0gaQBl0SE
— JanaSena Party (@JanaSenaParty) February 22, 2023