నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు ఆసక్తకిరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి, అలానే ప్రతిపక్ష పార్టీలో నుంచి అధికార పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సింహపురి రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కోటంరెడ్డి అభిమానులు బాణ సంచా కాలుస్తూ తెగ సందడి చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయం వద్ద కూడా బాణా సంచాల కాల్చారు. టీడీపీ ఆఫీస్ వద్ద పేల్చిన బాణా సంచాలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయే ఎవరికి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా సింహపురి కేంద్రంగా రాజకీయాలు చాలా హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ మంచి జోష్ మీద ఉంది. దానికూడా కారణం లేకపోలేదు. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఈ విజయాలతో టీడీపీ కార్య కర్తల్లోనూ ఉత్సహం రెట్టింపు అవుతుంది. తాజాగా శుక్రవారం వైస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ లో చేరారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు.
గిరిధర్ రెడ్డి చేరిక సమయంలో ఇటు నెల్లూరు, అటు అమరావతి అంతా పసుపుగా మారింది. రెండు ప్రాంతాల్లో కోటంరెడ్డి బ్రదర్స్, చంద్రబాబు ఫ్లెక్సీలు భారీగా దర్శనమిచ్చాయి. ఇక కోటంరెడ్డి అభిమానులు బాణాసంచాలు కాలుస్తూసంబరాలు జరుపుకున్నారు. కోటంరెడ్డి గిరిదర్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద పేల్చిన బాణాసంచా వలన ఇద్దరికి తీవ్రగాయాలు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాల్సింది ఉంది.
♦అమరావతి : కోటంరెడ్డి గిరిదర్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద పేల్చిన బాణాసంచా వలన ఇద్దరికి తీవ్రగాయాలు. pic.twitter.com/RSq4rAH8gl
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) March 24, 2023