నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
అమరావతి-న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టారు. విజయవాడలోని పట్టాభి రామ్ ఇంటిపై దాడులకు పాల్పడిన […]
పొలిటికల్ డెస్క్- హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీకి సమైఖ్య రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు బంజారాహిల్స్ లో భూమిని లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను నిర్మించారు. ఐతే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు లేకపోవడం, 30 ఏళ్ల లీజు సమయం అయిపోవడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాదీనం […]