ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ని దుర్భాషలాడతారా అంటూ భావోద్వేగానికి కూడా గురయ్యారు. తన ఫేస్బుక్ పేజీలో అదే అంశాన్ని సీఎం జగన్ పోస్ట్ చేయడం జరిగింది.
ఇదీ చదవండి: సన్నీకి చుక్కలు చూపిస్తున్న ప్రియ! ఇదెక్కడి మాస్ రా మావ?
‘ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంస్టిట్ట్యూషనల్ హెడ్. అలాంటి వ్యక్తిని కూడా బోషడీకే అని తిట్టగలుగుతున్నారు. బోషడీకే అంటే ల*జాకొడుకు అని అర్థం. ఇలా తిట్టి ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్ళని రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని ఆరాటపడడం సమంజసమేనా ?’ ఈ పోస్టు అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. సీఎంని తిట్టి.. అభిమానించే వారంతా రెచ్చిపోయి గొడవలు పడేలా చేయాలని చూడటం సరైందేనా అంటూ స్వయానా సీఎం జగన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.