జూన్ 10న జరగనున్న ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల ఎన్నిక కోసం అన్ని పార్టీల వాళ్లు తమ అభ్యర్థలు ఎంపికను మొదలు పెట్టాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం 10 అభ్యర్థుల ప్రకటించింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటు ఆశించి..భంగపడిన కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడా తన అంసతృప్తిని వ్యక్తం చేసింది. మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్ కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఆయనను ఉద్దేశించి.. తన 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైందని నగ్మా వాపోయారు.
2003-04లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనను రాజ్యసభకు పంపుతానని పార్టీ చీఫ్ సోనియా గాంధీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదని నగ్మా అన్నారు. 18 ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేస్తునే ఉన్నానని, అయిన సోనియా గాంధీ తనకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ను ఎంపిక చేశారని అన్నారు. “నేనేమైనా తక్కువ అర్హత కలిగి ఉన్నానా?” అని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కాగా నగ్మా ట్వీట్తో కాంగ్రస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి.. నగ్మా ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: లోకేష్ను కలిసిన YSRCP ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కూతురు
SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren’t in power thn.Since then it’s been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving
— Nagma (@nagma_morarji) May 30, 2022