ఈ సృష్టికి మూలం తల్లి. అమ్మ లేకుండా మానవ జాతి మనుగడ సాగించడం ప్రశ్నార్థకమే. పిల్లలు తొలి పలుకులు, మాటలు, నడకలు నేర్చుకునేది అమ్మ దగ్గరే. తొలి గురువు, దైవం కూడా మాతృమూర్తినే. తాను మరణిస్తానని తెలిసినా.. మరో జీవం పోసేందుకు సిద్ధమౌతుంది.
ఈ సృష్టికి మూలం తల్లి. అమ్మ లేకుండా మానవ జాతి మనుగడ సాగించడం ప్రశ్నార్థకమే. పిల్లలు తొలి పలుకులు, మాటలు, నడకలు నేర్చుకునేది అమ్మ దగ్గరే. తొలి గురువు, దైవం కూడా మాతృమూర్తినే. తాను మరణిస్తానని తెలిసినా.. మరో జీవం పోసేందుకు సిద్ధమౌతుంది. కష్టాన్ని, దు:ఖాన్ని దిగమింగుకుని పిల్లలకు అన్నీ తానే దగ్గరుండి చూసుకునేది కన్నతల్లే. పొత్తిళ్లలో పాపాయి దగ్గర నుండి.. పెళ్లితో ముడిపడి.. మరో బంధం ఏర్పడేంత వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆమె త్యాగనిరతిని దేనితోనూ కొలవలేం. అందుకే తల్లి లేకపోతే బిడ్డల పెంపకం విషయంలో తండ్రి సమస్యలు ఎదుర్కొంటామో కానీ.. తండ్రి లేకపోయినా తల్లి పిల్లలను సాకి,పెంచి, పెద్ద చేసి, ప్రయోజకులను చేయగలదు. ఇప్పుడు మరో మాతృమూర్తి కుమారుడు కోసం ఎవ్వరూ చేయని దుస్సాహాసానికి పాల్పడింది.
కొడుకు చదువు కోసం ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఏకంగా కుమారుడి భవిష్యత్ కోసం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. సేలం కలెక్టర్ ఆఫీసులో సఫాయి కార్మికురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ.. తన కొడుకు చదువుల కోసం రూ. 45వేలు అవసరం కావాల్సి వచ్చింది. తనకు కట్టే స్థోమత లేక ఎవర్నీ అడిగిన ఇవ్వకపోవడంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. మరీ ఎవ్వరన్నా చెప్పారో లేక ఆమె ఈ ఆలోచన చేసిందో తెలియదు కానీ.. తాను చనిపోతే ప్రభుత్వం నుండి డబ్బులు వస్తాయని, ఆ డబ్బులతో తన కుమారుడు చదువుకుంటాడని ఆశించిందీ ఈ పిచ్చి తల్లి. ఒక్కసారిగా బస్సు కింద పడి చనిపోదామని నిర్ణయించుకుంది అంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు పేర్కొన్నారు. దీంట్లో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. అయితే అంతలోనే బస్సు డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేయడంతో.. వాహనం తగిలి కింద పడిపోయింది. అయితే ఆమెకు స్వల్పంగా గాయాలయ్యినట్లు తెలుస్తుంది.
A mother kills herself to meet son’s education expenses 😢
Being misled by someone, a mother, working as ‘safai karmachari’ at Collector’s office in Salem, kills herself by falling into a bus to get financial assistance from the Govt to pay son’s college fees of 45,000.
— Arvind Gunasekar (@arvindgunasekar) July 17, 2023