హైదరాబాద్ క్రైం- సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. మానవ సంబంధాలు అంతకుంతకు సమకబారుతోంది. సొసైటీలోని కొందరు వావి వరసలు మరిచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ విపరీత ధోరణులతో అందరిలో ఆందోళన కలుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాటి ఘటన కలకలం రేపుతోంది.
మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి, అతడిపై లైంగిక దాడికి పాల్పడిందో మహిళ. ఆమె ఆ బాలుడికి మేనత్త వరస కావడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడి చేయడంతో పాటు, దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు దోచుకున్న మహిళ బాగోతం ఎట్టకేలకు బయటపడింది. టోలీచౌకిలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడి కుటుంబం ఇటీవల టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్కు షిఫ్ట్ అయ్యింది.
ఇళ్లు సర్దుతున్న సమయంలో బీరువాలో 20 తులాల బంగారం కనిపించకపోవడంతో బాలుడి తల్లికి అనుమానం వచ్చింది. గత కొన్ని రోజలుగా కొడుకు ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె, నేరుగా బంగారం ఏమైందని బాలుణ్ని ప్రశ్నించింది. దాంతో బాలుడు చెప్పింది విని ఆమె షాక్ అయ్యింది. బెంగళూరులో ఉండే వరసకు మెనత్త అయ్యే తండ్రి బంధువుకు ఆ బంగారం ఇచ్చినట్లు చెప్పాడా బాలుడు. ఈ క్రమంలో బాలుడు జరిగిందంతా పూజ గుచ్చినట్లు తల్లికి చెప్పాడు.
కొన్ని రోజుల క్రితం సదరు మేనత్త స్కూల్ కి వచ్చి తనను చార్మినార్ లోని లాడ్జ్కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడిందని తల్లికి వివరించాడు. ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి ఆ వికృత చేష్టలన్నింటిని వీడియో తీసి, అందరికి చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాడు. దీంతో ఇంట్లోని 20 తులాల బంగారంతో పాటు 6 లక్షలు ఆమెకు ఇచ్చానని భయంగా తెలిపాడు. ఇంకేముంది ఏ మాత్రం ఆలస్యం చేసకుండా బాలుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.