ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్. ఆ మహా నేత మరెవ్వరో కాదు వంగవీటి మోహన్ రంగా. రంగా చనిపోయి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ ఆయన పేరు చెబితే చాలు.. వైబ్రేషన్స్ పుట్టుకొస్తుంటాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. అందరివాడిగా పేరు సంపాదించారు. పేదలకు తానున్నానంటూ భరోసాను కల్పించాడు. యూనియన్ లీడర్ దగ్గర నుండి ఎమ్మెల్యేగా మారి.. రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ను చూపించిన నేత ఆయన. విజయవాడలోని గిరిపురం ప్రాంతానికి చెందిన పేదల ఇళ్ల కోసం నడి రోడ్డులో దీక్ష చేపడుతుండగా హత్యకు గురయ్యారు.
ఆయన హత్య జరిగిన తర్వాత ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద యెత్తున అల్లర్లు జరిగాయి. ఆయన రగిల్చిన స్ఫూర్తి ఇప్పటికీ కూడా ఎంతో మందికి ఆదర్శనీయం. అయితే అన్న రాధా చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రంగా.. చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుండి విజయవాడ నగరం నుండి పోటీ చేసి.. ప్రజలకు సేవ చేసి దేవుడయ్యాడు. 80వ దశకంలో ఏపీ రాజకీయాలను తీవ్ర ప్రభావం చేశారు. చెన్నుపాటి రత్నకుమారిని వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు పిల్లలు రాధా, ఆషాలత. ఆయన చనిపోయిన తర్వాత రంగా భార్య రత్నకుమారి ఎమ్మెల్యే పదవి చేపట్టారు. రంగా మీద అభిమానంతో ఆయన కుమారుడు రాధాకు చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా పట్టం కట్టారు విజయవాడ వాసులు. ఆ తర్వాత వరుసగా వైఫల్యాలు రావడం, పార్టీ మారడంతో ఆయన ప్రాభవం తగ్గుతూ వస్తోంది.
ఈ సమయంలో ఆ కుటుంబం నుండి ఒకరి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమెనే రంగా ముద్దుల తనయ ఆషాలత. ఈ ఫోటోలో చూస్తున్న ఆమెనే ఈ ఆషాలత. రాజకీయాలతో ముడిపడిన కుటుంబమైనా ఈమె పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏ పార్టీ నుండి పోటీ చేస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది. అమ్మ, అన్న, మేనమామ సూచనలు మేరకు టీడీపీలో లేదా వైఎస్సార్ కాంగ్రెస్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె పొలిటికల్ ఎంట్రీ కోసం మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. మరీ ఆషాలత.. తండ్రి రాజకీయాన్ని పుణికి పుచ్చుకుంటుందో లేదో చూడాలి.