ఉత్తర్ప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్లో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్కు బదులు వేరేది అందించారు. తొలుత కొవిషీల్డ్ తీసుకున్న 20మందికి రెండు డోసులో కొవాగ్జిన్ ఇచ్చారు. తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు అలా తీసుకున్న వారిని ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడంపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు కలగనప్పటికీ పూర్తి ఫలితాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తర్ప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియలో చోటుచేసుకున్న పొరపాట్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తొలి డోసులో ఒకటి, రెండో డోసులో వేరే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించలేదని పేర్కొంది. అయితే, ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘ఇది పరిశీలించాల్సిన విషయం. దీనిపై శాస్త్రీయ అవగాహన కోసం మరికొంత సమయం వేచి చూడాలి. కానీ, ఇలా వేర్వేరు టీకాలు తీసుకున్నప్పటికీ అందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు.తీవ్ర ప్రతికూల ప్రభావాలు సంభవించకపోవచ్చని.. అయినప్పటికీ వీటిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్తపడాలని సూచించారు. నిబంధనల ప్రకారం, తొలి డోసు తీసుకున్న వ్యాక్సిన్నే రెండో డోసులో ఇవ్వాలని స్ఫష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న చైనా కూడా వ్యాక్సిన్లను కలిపి ఇచ్చి ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమయ్యింది. భారత్లో మాత్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లపై ఇలాంటి ప్రయోగాలు జరపలేదు. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడంపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు జరుపుతోంది.