ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష మందికి ఒకరిలో కనిపించే అత్యంత అరుదైన అనారోగ్య సమస్య క్యాన్సర్..ఇప్పుడు వెయ్యిలో ఒకరికి ఉన్నట్లుగా మారిపోయింది. క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది బలైపోయారు. ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ..అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. అందుకే క్యాన్సర్ అంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా, వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు. అయితే కొందరు ఈ క్యాన్సర్ మహమ్మారి జయించారు. అయితే […]
టీకా సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ చిత్రాన్ని తొలిగించాలంటూ వేసిన పిటీషన్ పై కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరే దేశమూ వారి ప్రధానుల ఫొటోలు సర్టిఫికేట్ పై ముద్రించలేదంటూ చెప్పుకొచ్చిన పిటీషనర్ కు జస్టిస్ కున్హికృష్ణన్ చెప్పిన జవాబు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ పటీషన్ ను కొట్టివేయడమే కాకుండా.. పిటీషనర్ కు రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పుడు ఈ కేసు తీర్పు, జరిమానా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Kerala High Court […]
కనిపించని కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తూ చుక్కలు చూపిస్తోంది. కరోనా దాటికి ఇప్పటికి ఎంతో మంది మరణించారు. అయితే కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్ లు ప్రజలకు అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది ఉత్సహం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ దూసుకొస్తున్నా.. ఇప్పటికీ అనేక మంది వ్యాక్సిన్ తీసుకోకుండా జీవితంపై భద్రత లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోవడంపై ప్రభుత్వాలు, అనేక స్వచ్చంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఇవేం […]
దేశంలో కరోనా వైరస్ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. కరోనా నియంత్రణలో ఉండగా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన […]
హైదరాబాద్- భవిష్యత్ లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో […]
టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు కలిసి కోటికి పైగా డోసులను అందించాయని పేర్కొంది. వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటి మందికి టీకా వేశారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన ప్రధాని నరేంద్ర […]
దేశం కరోనా కేసులు తగ్గడం లేదు. మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా ఈ వేరియంట్ వదలడంలేదు. మారిపోతున్న వేరియంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 డోసులు వేయించుకున్న వాళ్లు, మూడో డోస్ కూడా వేయించుకునే అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ డెల్టా పై అందరికీ భయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెల్టా వేరియంట్ బారిన […]
టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది. కేరళలోని కేసుల తీరును చూస్తే […]
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ధనిక దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని బూస్టర్ డోసుల వైపు అడుగులు వేస్తున్నాయి. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్టర్ డోసులు […]
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే డ్రాప్స్ మందును తీసుకొస్తోంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థకి దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని ఇవ్వాలని కోరింది. ఇప్పటికే కొవాగ్జిన్ పేరుతో టీకాను తయారు చేసింది భారత్ బయోటెక్. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకా కంటే ముక్కులో చుక్కల మందు ద్వారా టీకా ఇవ్వడం ఇంకా సౌకర్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఎక్కువ మంది […]