కాకతీయుల చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు – ప్రాంతాలు ఏవీ లేవు. రామప్ప – రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆలయానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం మన దేశంలో మరెక్కడా లేదు. క్రీ.శ.1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది.మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. శతాబ్దాల చరిత్రగతన్న కాకతీయ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది. నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’ దేవాలయాన్ని ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే నెల 25న యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. యునెస్కో గుర్తింపునకు కృషిచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఎంపీలు కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్సింగ్ పాటిల్ను కలిసి వినతిపత్రం అందించారు.
రామప్ప దేవాలయాన్ని యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ (ఐకోమాస్) ప్రతినిధిగా వాసుపోశానందన్ 2019 సెప్టెంబరు 25న సందర్భించారు. దేవాలయాన్ని అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై 2020 ఫిబ్రవరిలో 21 దేశాల సమావేశం చైనాలో జరగాల్సిన ఈ సమావేశం కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. ఈసారి పక్కాగా రామప్ప గుడికి సానుకూల నిర్ణయం వస్తుందని చారిత్రక నిఫుణులు ఆశాభావంతో ఉన్నారు.
రామప్ప దేవాలయం అద్భుత విశేషాలు ఈ వీడియో లో చూడండి.