బుల్లితెర డెస్క్- తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని స్టార్ మా ప్రకటించడమే కాదు, అధికారికంగా ప్రోమో కూడా విడుదలైంది. అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతున్నారు. దీంతో బిగ్ బాస్ షో సీజన్ 5 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారన్నదానిపై ఉత్కంఠ నెలకంది.
బిగ్ బాస్ సీజన్ 5 షోకు చాలా మంది పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా హీరోయిన్ ప్రియా రామన్, హీరోయిన్ ఇషా చావ్లా, బుల్లితెర యాంకర్లు రవి, వర్షిణి, సీరియల్ నటి నవ్యస్వామి, సిరి హన్మంత్, లోబో, యూట్యూబర్ నిఖిల్, ఆర్జే కాజల్, వీజే అండ్ బుల్లితెర నటుడు సన్నీ, బుల్లితెర అండ్ వెండితెర నటి ప్రియ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, ఓ మోడల్ ఎంపికయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ సారి బిగ్ బాస్ షోలో ప్రముఖ నటి సురేఖా వాణి పాలుపంచుకోబోతోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షోపై ఆమె స్పందించారు. చేతులెత్తి దండం పెడుతున్నట్టుగా అందరినీ ప్రార్థించారు సురేఖా వామి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి, నేను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదు.. అని స్పష్టం చేశారు.
మొత్తానికి తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని సురేఖా వాణి తేల్చిచెప్పారు. మరి మిగతా వాళ్లలో ఎవరెవరు ఈ షోలో పాల్గొంటున్నారో మాటీవీ అధిరికంగా ప్రకటించే వరకు స్పష్టతరాదు. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.