ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతేవేగంగా మనిషి జీవన విధానంలో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అంటే తెలియనివారు లేరు. అలాగని అందరికి దాన్ని పూర్తిగా వాడటం తెలియదు.
స్మార్ట్ ఫోన్ లో ఇప్పుడు సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే.. పాస్ వర్డ్స్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ లాక్ ఇలా చాలా సెక్యూర్ వేస్ ఉన్నాయి. కానీ టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి కష్టమైన లాక్స్ ఓపెన్ చేసేస్తున్నారు స్మార్ట్ దొంగలు. మాములుగా స్మార్ట్ ఫోన్ లాక్స్ ఓపెన్ చేయడం చాలా కష్టం. కానీ ఎలాంటి లాక్ ఉన్నా ఓపెన్ చేసి డబ్బు దోచేయొచ్చని నిరూపించాడు చైనాకి చెందిన ఓ యువకుడు.
అసలు విషయానికి వస్తే.. చైనాలోని నానింగ్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల హువాంగ్.. తన మాజీ ప్రియురాలు డాంగ్ నిద్రపోయే సమయంలో తన స్మార్ట్ ఫోన్ ని అన్లాక్ చేసి మరీ రూ.18 లక్షలు డబ్బులు కాజేసాడు. వినటానికి షాకింగ్ గా ఉన్నా.. అతని కాజేసిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిద్రపోతున్న ప్రియురాలు డాంగ్ ఫోన్ ని యాక్సెస్ చేసేందుకు.. తనకు తెలియకుండా తన కనురెప్పలు ఓపెన్ చేసి మరి ఫోన్ లాక్ తీసాడు. ఆ తర్వాత ఆమె ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా డాంగ్ ఖాతా నుంచి ఏకంగా రూ.18 లక్షలు కాజేసాడు.
ఆమె నిద్రలేచాక ఫోన్ కి పెద్దమొత్తంలో మనీ డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో డాంగ్ పసిగట్టింది. ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. కొన్ని నెలలు తర్వాత పోలీసులు హువాంగ్ ని అరెస్ట్ చేసారు. డాంగ్ భోజనం తర్వాత మందులు వేసుకుని నిద్రపోయే టైంలో హువాంగ్.. డబ్బు కాజేసినట్లు కోర్టు విచారణలో బయటపెట్టాడు. కోర్టు ఈ స్మార్ట్ దొంగకి రూ. 2 లక్షలు జరిమానాతో పాటు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. ఈ స్మార్ట్ ప్రియుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి