ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా అంటూ సినిమా ఛాన్సుల కోసం వెల సంఖ్యల్లో స్టూడియోల వెంట తిరుగుతుంటారు ఔత్సాహిక కళాకారులు. అలాంటి వాళ్లను కొంతమంది బ్రోకర్లు దారుణంగా మోసం చేస్తుంటారు.
సినిమా రంగం అందమైన రంగుల ప్రపంచం అని అందరూ అంటుంటారు. ఒక్కసాకి వెండితెరపై, బుల్లితెరపై కనిపిస్తే చాలు సెలబ్రెటీ హోదా లభిస్తుందని భావిస్తుంటారు ఎంతోమంది కళాకారులు. అందుకోసం స్టూడియోల వెంట ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఒక్క చిన్న చాన్స్ ఇవ్వండి మా టాలెంట్ ఏంటో చూపిస్తాం అంటూ దర్శక నిర్మాతలను కలిసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారి వీక్ నెస్ తో చాలా మంది బ్రోకర్లు ఎన్నో దారుణాలకు పాల్పపడుతుంటారు. అబ్బాయిల వద్ద డబ్బులు వసూళ్ళు చేస్తే.. అమ్మాయిలను లైంగికంగా లొంగదీసుకుంటారు. అలా బ్రోకర్ చేతుల్లో మోసపోయిన విషయం తెలుసుకొని ఎంతోమంది యువతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి.
తాజాగా సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి యువతిని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలో ఒక్క వెలుగు వెలిగి మంచి గుర్తింపు తెచ్చుకొని విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు అని చాలా మంది భావిస్తుంటారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు సినిమాల్లో రాణించాలని ఇండస్ట్రీకి వస్తుంటారు. అలాంటి వారిని కొంతమంది బ్రోకర్లు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని మభ్యపెట్టి దారుణమైన మోసాలకు పాల్పపడుతుంటారు. అమ్మాయిలను అయితే తమకు పడక సుఖం ఇస్తే.. మంచి ఆఫర్లు ఇప్పిస్తామని చెప్పి లొంగదీసుకుంటారు.. తర్వాత రోడ్డున పడేస్తుంటారు.
ఓ యువతి అలాంటి దారుణమైన మోసానికి పాల్పపడింది.. ఆఫర్లు ఇప్పిస్తాడన్న నమ్మకంతో తన సర్వస్తాన్ని అప్పగించింది. తీరా అతడు మోసం చేశాడని తెలుసుకొని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి పేరు బిందు.. చిన్ననాటి నుంచి నటన అంటే ఎంతో మక్కువ చూపించేది. చుట్టుపక్కల వాళ్లు నువ్వు సినిమా హీరోయిన్ లా ఉంటావు అంటే ఉబ్బితబ్బిబ్బై పోయేది. ఈ క్రమంలోనే సినిమాల్లో రాణించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు ఇండస్ట్రీ పెద్దలతో బాగా పరిచయాలు ఉన్నాయని.. చాలా మందికి ఆఫర్లు ఇప్పించానని.. వాళ్లందరూ మంచి పొజీషన్లో ఉన్నారని చెప్పి నమ్మించాడు.
తనను నమ్ముకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని బిందుని తన మాయమాటలతో నమ్మించాడు. అలా బిందుని షూటింగ్స్ తిప్పుకుంటూ.. ఇండస్ట్రీ తనకు బాగా పరిచయం అన్నట్టు నమ్మించాడు.తన జీవిత ఆశయం నెరవేరబోతుందని ఆనందంతో తన సర్వస్వాన్ని అప్పగించింది బిందు. అంతేకాదు అతనితో సహజీవనం చేసింది. కొద్దిరోజుల తర్వాత పూర్ణచందర్ మరో యువతితో తిరగడం మొదలు పెట్టాడు.. దీంతో తాను దారుణంగా మోసపోయానని.. ఎవరికీ చెప్పుకోలేక మనస్థాపానికి గురై డిప్రేషన్ లోకి వెళ్లిపోయింది. ఆ బాధతోనే రాయదుర్గం లోని 21 అంతస్తు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.