మహారాష్ట్ర- పగ, ప్రతీకారం.. ఇవి మనుషులకు సహజమే. మనుషులు ఇతరులపై పరిస్థితులను బట్టి పగ పడతారు. సందర్బం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం నమం చూస్తూనే ఉంటాం. కానీ జంతువులు పగ పడ్డడమే వింతగా ఉంది. అవును మహరాష్ట్రలో కోతులు కుక్కలపై పగ బట్టాయి. ఏకంగా 250 కుక్కలను చంపేసి తమ పగను తీర్చుకున్నాయి కోతులు. వినడానికి కాస్త వితంగానే ఉన్నా ఇది అక్షరాల జరిగింది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజలగాం అనే ప్రాంతంలో నెల రోజుల్లో ఏకంగా 250 కుక్కుపిల్లల్ని కోతులు చంపేసిన వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే కుక్కలను కోతులు ఇంత దారుణంగా చంపేయడానికి ప్రతీకారమే కారణమని తెలుస్తోంది. లవూల్ అనే గ్రామంలో నెల రోజుల క్రితం కుక్కల గుంపు ఓ కోతి పిల్లను కరిచి చంపేశాయి. దీంతో కుక్కులపై పగబట్టిన స్థానిక కోతుల గుంపు అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.
కుక్కపిల్లలు ఒంటరిగా కనిపిస్తే కోతులన్నీ గుంపుగా వెళ్లి రౌండప్ చేసి ఎత్తుకెళ్లడం, చెట్లు, భవనాల పైనుంచి వాటిని కిందికి తోసేసి చంపేస్తున్నాయి. ఒకవేళ అప్పటికీ చనిపోకపోతే.. మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా లవూల్ గ్రామంలో ఇదే విధంగా కోతులు తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాయి. ఇలా నెల రోజుల్లోనే మొత్తం 250 కుక్కలను కోతుల గుంపు చంపేసిందని స్థానికులు తెలిపారు.
మొత్తం 5 వేల మంది జనాభా ఉండే లవూల్ అనే గ్రామంలో ప్రస్తుతం ఒక్క కుక్కపిల్ల కూడా బతికి లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బారి నుంచి కుక్కపిల్లల్ని రక్షించాలని ఎన్ని ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని, కుక్క పిల్లల్ని వెతికి మరీ కోతుల గుంపు మట్టు బెట్టిందని ఆవేధన చెందారు. ఐతే ఇప్పుడు కోతుల గుంపు చూపు చిన్న పిల్లలపై పడిందని, పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా కోతులు దాడులకు పాల్పడుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నుంచి తమను రక్షించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు లవూల్ గ్రమస్థులు.