తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ.., వారిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్థానం మాత్రం ప్రత్యేకం. వల్గర్ పంచ్ లకి దూరంగా ఉంటూ.., ఫ్యామిలీతో కలసి చూసేలా ఆరోగ్యకరమైన హాస్యం పంచడంలో ప్రదీప్ దిట్ట. రీల్ లైఫ్ లో ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే ప్రదీప్.., ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో తనని ప్రదీప్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ అమ్మాయి ఏకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆ వ్యవహారం నుండి బయటపడ్డ కొన్ని రోజులకే ఈ స్టార్ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయంలో ప్రదీప్ బాగానే ట్రోల్స్ కి గురయ్యాడు. ఇక ఇప్పుడు అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ప్రదీప్ పొలిటికల్ హీట్ ఉన్న సబ్జెక్టుని టచ్ చేసి కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
తాజాగా యాంకర్ ప్రదీప్ ఓ షోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నోరు విప్పాడు. ఈ సమయంలో అతడు ఏపీ క్యాపిటల్గా అమరావతిని కాదని.., విశాఖపట్నం అంటూ స్పందించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం అయ్యింది. ఏపీ రాజధాని విషయంలో యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ రాజధానికి సంబంధించిన విషయం కోర్టులో ఉంది. అలాంటి అంశం గురించి టీవీ షోలలో ఎలా మాట్లాడతారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ప్రదీప్ తో పాటు, ఛానెల్ యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. కానీ.., నెటిజన్స్ మాత్రం ఈ విషయంలో ప్రదీప్ కి మద్దతు తెలియచేస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయి. ప్రధాన రాజధాని విశాఖపట్నం అని ప్రభుత్వమే చెప్తోంది. అలాంటిది ప్రదీప్ ఇదే విషయాన్ని చెప్తే.. తప్పు ఏంటి అంటూ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. మరి రానున్న కాలంలో ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.