హైదరాబాద్- భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట తెలుగు సినిమా మాట. ఎంటీ ఆశ్చర్యంగా ఉందా. అవును.. మోదీ స్వయంగా తెలుసు సినిమాల గొప్పతనం గురించి వివరిస్తూ, పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా హైదరాబాద్ వేధికగా ప్రధాని మోదీ టాలీవుడ్ పై ప్రశంసలు గుప్పించడం విశేషం.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామ నగరంలో సమతా మూర్తి శ్రీరామాననుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో తెలుగు భాషా చరిత్ర ఎంతో గొప్పదని కొనియాడిన ప్రధాని మోదీ, తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసలు జల్లు కురిపించారు. తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని, సిల్వర్ స్క్రీన్ పై తెలుగు సినిమా అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు.
దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉందని, శ్రీ రామానుజాచార్యులు బోధించిన విశిష్టాద్వైతం మనకు ఇన్స్పిరేషన్ అని మోదీ అన్నారు. చిన జీయర్ స్వామి తనతో విష్వక్వేనేష్టి యాగం చేయించారని, ఆ యాగ ఫలం దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు అందాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇదే సందర్భంలో శ్రీరామ నగరంలోని 108 దివ్య క్షేత్రాలను సందర్శించిన మోదీ, దేశమంతా తిరిగి పుణ్య క్షేత్రాలు సందర్శించిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు.
బాహుబలి సినిమా ప్రపంచ మార్కెట్ లో తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుంచి RRR, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులే కాకుండా, ప్రపంచ సినీ ఇండస్ట్రీ సైతం ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ తెలుగు సినీమాలపై ప్రశంసలు కురిపించారు.
🙏🙏🙏🙏 #TeluguCinema 🙏🙏 pic.twitter.com/YYAjBygPow
— Harish Shankar .S (@harish2you) February 5, 2022