ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల ముందు నవరత్నాల కింద ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల ముందు నవరత్నాల కింద ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. వీటి కోసం లబ్దిదారులు కాళ్లు అరిగిపోయేలా తిరగకూడదన్న సదుద్దేశంతో సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి వివరాలు తెలుసుకుని, ఏఏ పథకాలు లబ్ది చేకూరుతాయో అవగాహన కల్పిస్తున్నారు. అయితే అదే సమయంలో కొంత మంది వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించి ఆ వ్యవస్థ పట్ల నమ్మకం పోయేలా చేస్తున్నారు. ఒకరిద్దరి వల్ల వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టేవిధంగా పరిస్థితి మారింది.
మొన్నటికి మొన్న విశాఖలోనిపెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్లో బంగారం కోసం వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో కుంభకోణమే బయటకు వచ్చింది. కంచె చేను మేసిన చందంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు ప్రవర్తించారు. ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసుకున్న ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో చోటుచేసుకుంది. సంక్షేమ పథకాల కోసం సచివాలయ ఉద్యోగులే.. నకిలీ పేపర్లను సిద్ధం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే. సెజ్ కాలనీ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్న సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు. అలాగే ఆ సచివాలయంలోనే మహిళా పోలీసులుగా వ్యవహరిస్తున్న బెల్లి రాజేశ్వరి, పైలా వెంకట లక్ష్మి, మరో మహిళ.. తమ భర్తలతో కలిసి ఉంటుంగా.. విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్
ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో… pic.twitter.com/bEc7gYW6TX
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2023