జీవిత భాగస్వామికి తెలియకుండా మరొకరితో శారీరక సంబంధాలను పెట్టుకుంటూ.. ఏమీ ఎరుగని వాళ్లలా, ఒక్కొక్కసారిగా సామాజాన్ని ఉద్దరించేలా పెద్ద మాటలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు. ఇక దొరికితే ఎలా ఉంటుందో ఈ వార్త చదివేయండి.
‘ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. నన్నెవ్వరూ చూడటం లేదు కదా అనుకుంటుందట’అని సామెత. నన్నెవ్వరూ చూస్తారులే అని తప్పు చేయడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల విషయంలో ఇది నిజంగా నిజం. జీవిత భాగస్వామికి తెలియకుండా మరొకరితో శారీరక సంబంధాలను పెట్టుకుంటూ.. ఏమీ ఎరుగని వాళ్లలా, ఒక్కొక్కసారి సమాజాన్ని ఉద్దరించేలా పెద్ద మాటలు చెబుతూ కాలం గడిపేస్తుంటారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్న చందంగా సాగిపోతుంటుంది యవ్వారం. ఇక దొరికితే ఎలా ఉంటుందో ఈ వార్త చదివేయండి.
ఓ మహిళకు ఆమె భర్త చనిపోయాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇది చూసిన ఊరి వాళ్లు.. ఇద్దరినీ ఉతికారేశారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్లో జరిగింది. అనుగుల్ జిల్లా తాల్చేరు సమితి ఖండాలో పంచాయతీ పరిధిలోని ఉంటున్న ఓ మహిళకు వివాహమై.. కొన్నేళ్ల తర్వాత భర్తను కోల్పోయింది. పోషణార్థం సెక్యూరిటీ ఉద్యోగం చేస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం బాలుగామ్ ప్రాంతానికి చెందిన యువకుడితో ఆమెకు పరిచయమైంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి.. అక్రమ సంబంధానికి దారి తీసింది. రోజూ ఆమె ఇంటికి వెళ్లి.. వస్తుండేవాడు. ఇంట్లో అత్తమామలు ఉండగానే.. ఈ మొత్తం వ్యవహారం సాగింది.
అయితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అత్తమామలు ఉండిపోయారు. కోడలికి చెబుతున్నా వినిపించుకోకపోవడంతో.. ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు వీరిద్దరూ. బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు యువకుడు. కాపు కాసిన గ్రామస్థులు.. వీరిద్దరినీ బయట నుండి గడియపెట్టారు. గురువారం ఉదయం గది తలుపులు తెరిచిన గ్రామస్థులు ఇద్దరినీ ఓ తాడుకు కట్టి ఊరంతా ఊరేగించారు. తర్వాత విద్యుత్ స్థంభానికి కట్టేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పెద్దలు పిలిపించి, చర్చించి.. ఆ తర్వాత వదిలిపెట్టారు. గ్రామస్థులు వారిని తాడుతో కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.