దేశంలో ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. మహిళల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నాయి. సాధారణంగా రక్షాబంధన్ పండుగ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కొన్ని ప్రభుత్వాలు ఉచిత బస్ సౌకర్యం కల్పిచండం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నది.. అది ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకుందాం…
ఉత్తరప్రదేశ్ లో ప్రజాభినామంతో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు యోగి ఆదిత్యనాథ్. ఉత్తర్ ప్రదేశ్ లో రెండవసారి పరిపాల చేపట్టిన యోగి 37ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలకు పాల్పపడే వారికి జైలు శిక్ష విధించడమే కాదు.. అధికారులను పంపించి వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్నారు. గత కొంత కాలంగా యూపీలో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గిందని అంటున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ మహిళలకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారికి అందేలా చేస్తున్నారు. తాజాగా మహిళల విషయంలో ఆయన మరో సంచలన నిర్ణయంతీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 60 ఏళ్లు పైబడిన మహిళలకు శుభవార్త వెల్లడించారు. యూపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని.. మేని ఫెస్టోలో ఉచిత ప్రయాణ హామీ ఇచ్చామని.. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరున అసెంబ్లీ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో యూపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇక వృద్ద మహిళలు బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల యూపీఎస్ఆర్టీసీకి సమకూరే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని యూపీ అధికారులు తెలిపారు. అంతేకాదు వృద్ద మహిళల నుంచి ఆర్టీసీ చార్టీలు వసూలు చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పోరేషన్ కి రూ. 800 కోట్లకు పైగా పరిహారం అవసరం ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సమాచారం అందించామని అధికారులు తెలిపారు. మరోవైపు వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల లోపు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర అన్ని హామీలు నెరవేర్చే యోచనలో యూపీ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.