ప్రపంచ వింతల్లో ఏడవదైన తాజ్ మహల్ మునిగిపోతుందా? స్థానికులు, అధికారులు ఏం చెబుతున్నారు?
ఆగ్రాలో యమునా నది నీటి మట్టం 495.8 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో తాజ్ మహల్ కు వరద ముప్పు పొంచి ఉందని ఆగ్రా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆగ్రా, అలీగఢ్ లో యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆగ్రాలో పెరుగుతున్న నీటి మట్టం వల్ల తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే యమునా నది నీరు పారుతుండడం కారణంగా ఆ నీరు తాజ్ మహల్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజ్ మహల్ చుట్టూ చేరిన వరద నీరు స్మారక చిహ్నం వినాశకరంగా మారింది.
యమునా నది నీటి మట్టం పెరిగిపోతుండడంతో వరద నీరు రోడ్లు, తాజ్ గంజ్ లోని శ్మశానవాటిక, ఇత్మాద్ ఉద్ దౌలా స్మారక చిహ్నం, తాజ్ మహల్ లోని స్మారక చిహ్నం వద్ద చేరుకుంది. యమునా నదిలోని నీటి మట్టం ఆదివారం సాయంత్రం 4 గంటలకు 495.8 అడుగులకు చేరుకోగా.. తక్కువ వరద స్థాయికి 495 అడుగులు, మీడియం వరద స్థాయికి 499 అడుగులు, అత్యధిక వరద స్థాయికి 508 అడుగులకు చేరుకుందని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యశ్వర్ధన్ శ్రీవాస్తవ్ వెల్లడించారు. సికంద్రాలోని కైలాష్ టెంపుల్ నుంచి తాజ్ మహల్ దగ్గరున్న దసరా ఘాట్ వరకూ ఘాట్ల వద్ద బారికేడ్లను ఇన్స్టాల్ చేయడం వంటి ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆగ్రా జిల్లాలోని చంబల్ నది సరిహద్దు ఆగ్రా జిల్లా చుట్టూ సమీప గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకుని మెడికల్ క్యాంపులు పెట్టారు. మథురలోని ఓక్లా బ్యారేజ్, గోకుల్ బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేయడం వల్ల ఆగ్రాలోని యమునా నది నీటి మట్టం పెరగడానికి కారణమైంది. ఆ బ్యారేజీల ఏడు గేట్లు ఓపెన్ చేయడం వల్ల 1,06,473 క్యూసెక్కులు, 1,24,302 క్యూసెక్కుల నీరు గత 24 గంటల్లో నీరు విడుదలైంది. ఈ కారణంగా యమునా నది నీటి మట్టం పెరిగింది. ఇప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ మునిగిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నారు.