ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యులు చేసిన పనికి ఆయన తీవ్ర మనోవేదకు గురయ్యారు. టెబుళ్లు ఎక్కటం, ఆపై అల్లరి పెట్టడం సభ నిబంధనలకు విరుద్దంగా ప్రవరిస్తున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో సభలోని కొందరు సభ్యులు సభా మార్యాదలకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు అనే దేవాలయం లాంటి సభను ఇష్టమొచ్చిన రీతిలో సభా నియమాలకు నీళ్లొదిలారని అన్నారు.
రాజ్యసభలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా అంతా రచ్చ రచ్చ జరిగింది. దీంతో కొందరు సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేయటం, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం వంటివి చేస్తూ అల్లరిగా ప్రవర్తించారు. దీంతో పాటు రూల్ బేక్ని చింపేసి గాల్లోకి విసిరేశారు. కొందు ఎంపీలైతే ఛైర్మన్ సీటుకు దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట.. టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు అక్కడే బైఠాయించారు.
అలా రాజ్యసభ సభ్యులు ప్రవర్తించిన తీరు పట్ల చాలా మనోవేదనకు గురయ్యానని, దానిని తలుచుకుంటే రాత్రుల్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు అనుచిత ప్రవర్తన పట్ల రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి కన్నీటికి లోను కావటం పట్ల ప్రజలు ఎంపీల తీరు పట్ల మండిపడుతున్నారు.