ఈ మధ్య కాలంలో ఒకరికి తెలియకుండా.. ఒకరిని వివాహం చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిలో ఆడవారు, మగవారు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి నిత్య పెళ్లికొడుకు వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నాలుగు పెళ్లిల్లు చేసుకున్నాడు. మొత్తం ఏడుగురు సంతానం ఉండగా.. తాజాగా ఐదో పెళ్లికి సిద్ధం అయ్యాడు ఓ ప్రబుద్ధుడు. దీని గురించి అతడి పిల్లలకు తెలిసింది. కట్ చేస్తే.. మండపానికి వచ్చిన పిల్లలు తండ్రిని చితకబాదారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని సీతాపుర్ జిల్లాల మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి ఇలా రోడ్డు కాంట్రాక్టర్గా పని చేసేవాడు. అతడు ఇప్పటికే నాలుగు పెళ్లిల్లు చేసుకున్నాడు. తొలుత మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. కొన్నాళ్లకు రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడుగురు సంతానం. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ గత ఆరునెలల నుంచి రెండో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు.
రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సదరు కాంట్రాక్టర్ రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతంటితో ఆగక తాజాగా ఐదో పెళ్లికి సిద్ధపడ్డాడు. మంగళవారం రాత్రి రహస్యంగా ఐదో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ విషయం తన రెండో భార్య, ఆమె పిల్లలకు తెలియడంతో.. వారు, తమ బంధువులతో సహా వివాహం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుపడ్డారు. ఇక భార్య, పిల్లలు పెళ్లి కుమారుడిగా ముస్తాబైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.
అనంతరం ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో.. వారు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సదరు కాంట్రక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం చూసిన పెళ్లి కుమార్తె నుంచి అక్కడి పరారయ్యింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజయేండి.