ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి ఏడుస్తుందనే కారణంగా సవతి తల్లి ఆ పసిబిడ్డను హైవేపై విసిరేసింది. అటు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బాగపత్ లోని ఓ సవతి తల్లి రెండేళ్ల చిన్నారిపై గత కొంత కాలం నుంచి కోపంతో ఉంది. ఎలాగైన హత్య చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమచారం. ఇందులో భాగంగానే శక్రవారం ఆ రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ ఉంది. దీంతో ఆమె కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. భరించలేకపోయిన ఆ మహిళ యమనోత్రి హైవేపై ఏడుస్తున్న రెండేళ్ల చిన్నారిని విసిరేసింది. దీంతో అటు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: దారుణం.. ప్రేమను అంగీకరించలేదని పెట్రోల్ పోసి చంపేశాడు!