‘ఒమిక్రాన్ వేరియంట్’ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న తరుణంలో తాజా వేరియంట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడో దశ కరోనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరించడానికి కూడా ఈ కొత్త వేరియంట్ కారణం. ఇప్పటికే దాదాపు 77 దేశాలను చుట్టేసింది ఈ వేరియంట్. డబ్లూహెచ్ వో కూడా అత్యంత జాగ్రతగా ఉండాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం ఒకింత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఢిల్లీలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది.
ఒమిక్రాన్ కేసుల విషయంలో ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. ‘ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. వారిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన తొమ్మిది మందిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి’ అంటూ మంత్రి తెలిపారు. అసలు ఒమిక్రాన్ కేసులో విషయంలో ఢిల్లీ సీఎం భయపడిందే జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ సీఎం ఎప్పుడో అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాలంటూ ప్రధానికి లేఖ రాశారు.
Delhi has 10 cases of #OmicronVariant so far. Out of these 10, one has been discharged and nine are still admitted at LNJP Hospital. None of them is a severe case: Delhi Health Minister Satyendar Jain
(File photo) pic.twitter.com/0lNzuMa3BR
— ANI (@ANI) December 16, 2021
అంతర్జాతీయ సర్వీసుల్లో చాలా వరకు విమానాలు ఢిల్లీ విమానాశ్రయంలో ఆగుతాయని.. రెండు దశల్లోనూ ఢిల్లీలో కేసులు ఎక్కువ రావడానికి కారణం అదేనని కేజ్రీవాల్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోనందుకే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని.. రిసల్ట్ వచ్చాకే విమానాశ్రయం నుంచి వాళ్లాల్సి ఉంటుందని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.