ఈ మధ్యకాలంలో పలు చోట్ల అగ్నిప్రమాదలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఏదైన ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఇలా అనేక అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని.. ఎందరో మంటలకు ఆహుతి అయ్యారు. ఇటీవల సికిందరాబాద్ లోని ఓ లాడ్జీలో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. బీహార్ లోని ఔరంగాబాద్ లో శనివారం తెల్లవారు జామున ఘరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. అందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ నగరంలోని శాహ్ గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు రెండు గంటల సమయంలో వంటలను తయారు చేస్తోంది. సూర్యోదయం లోపులో ప్రసాదం చేయాలనే భావనతో అందరూ పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్కనే ఉన్న సిలిండర్లకు అంటుకుని మంటలు భారీగా వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమయ్యాయి. ఈ ఘటనలో 30 మంది గాయాలయ్యారు. అందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఔరంగాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదంకి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.